చిత్తూరు జిల్లా, పూతలపట్టు మండలంలోని ఎం. బండపల్లి గ్రామంలో సోమవారం జరిగిన ఏరువాక పౌర్ణమి వేడుకలలో ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ పాల్గొన్నారు. ఈ పవిత్ర పర్వదినాన తాను స్వయంగా నాగలితో దుక్కి దున్నడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. రైతాంగానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.