
చిత్తూరు జిల్లాలో నమోదైన వర్షపాత వివరాలు
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గత 24 గంటల్లో నమోదైన వర్షపాత వివరాలను వాతావరణ శాఖ అధికారులు శుక్రవారం వెల్లడించారు. అత్యధికంగా నగరి నియోజకవర్గం, నిండ్రలో 83.4 మి.మీ వర్షం కురవగా, అత్యల్పంగా పలమనేరు నియోజకవర్గం, పెద్దపంజాణిలో 2.6 మి.మీ నమోదైంది. సోమల, కుప్పం, విజయపురం, నగరి, శ్రీరంగరాజపురం, పాలసముద్రం, గుడుపల్లె మండలాల్లో కూడా గణనీయమైన వర్షపాతం నమోదైంది.






























