వరదయ్యపాలెం: ఇద్దరు అయ్యప్ప భక్తులు మృతి

3చూసినవారు
వరదయ్యపాలెం: ఇద్దరు అయ్యప్ప భక్తులు మృతి
తిరుపతి జిల్లాకు చెందిన వేణు, అతని కుమారుడు రాజేశ్, కుమార్తె చాతుర్య అయ్యప్ప దర్శనం అనంతరం మంగళవారం స్వగ్రామానికి కారులో తిరుగు పయనమయ్యారు. మార్గంమధ్యలో కేరళలోని తేని-దిండికల్ బైపాస్లో పెరియకుళం వద్ద కారు బ్రిడ్జిని ఢీకొనడంతో రాజేశ్ (28) అక్కడిక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన వేణు (58), డ్రైవర్ తేజను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ వేణు కూడా మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్