శ్రీకాళహస్తి: రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమారుడు మృతి

3012చూసినవారు
శ్రీకాళహస్తి: రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమారుడు మృతి
నాయుడుపేట–పూతలపట్టు హైవేపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాళహస్తికి చెందిన సుబ్రహ్మణ్యం (31) మరియు అతని కుమారుడు రూపేశ్ (11) మృతి చెందారు. నాయుడుపేటలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా, గురప్పతోట సమీపంలో ట్యాంకర్ బైక్‌ను ఢీకొట్టడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. సుబ్రహ్మణ్యం సంఘటనా స్థలంలోనే మరణించగా, తీవ్రంగా గాయపడిన రూపేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్