నాయుడుపేట-పూతలపట్టు జాతీయ రహదారిపై సూళ్లూరుపేట మండలం పొయ్యి కొత్తూరు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బెంగళూరులో ఉంటున్న దుర్గాప్రసాద్ (23) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్వగ్రామానికి బైక్పై వస్తుండగా అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.