చిట్టమూరు మండలంలోని కోగిలి పంచాయతీలో పెన్షన్ డబ్బులు అందక లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో, సచివాలయ, ఎంపీడీఓ సిబ్బంది ఫోన్లకు స్పందించడం లేదని బాధితులు తెలిపారు. ఉన్నత అధికారులు జోక్యం చేసుకుని, కార్యదర్శిపై చర్యలు తీసుకుని, ప్రజలకు పెన్షన్ డబ్బులు ఇప్పించాలని వారు కోరుతున్నారు.