రామకుప్పం మండలంలో 19 ఏనుగుల సంచారం కలకలం రేపుతోంది. తమిళనాడు వైపు నుంచి వచ్చిన 16 ఏనుగుల గుంపు పెద్దూరు అటవీ ప్రాంతంలో ఉండగా, గొల్లపల్లి సమీపంలో జంట ఏనుగులు, ననియాల వద్ద ఒంటరి ఏనుగు కనిపించింది. అటవీ అధికారులు రైతులను వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లొద్దని బుధవారం హెచ్చరికలు జారీ చేశారు.