తిరుపతిలోని చేపల మార్కెట్లో సోమవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించారు. అధికారి జగదీశ్ నేతృత్వంలో చేపల నిల్వలు, పరిశుభ్రత, పాడైన చేపల విక్రయాలపై అధికారులు పరిశీలించారు. నాణ్యత లేని చేపలను విక్రయిస్తున్న కొందరు వ్యాపారులకు జరిమానాలు విధించారు. ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.