తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి సంచారం మరోసారి కలకలం రేపింది. 150వ మెట్టు వద్ద చిరుత రోడ్డు దాటుతుండగా చూసిన భక్తులు భయంతో కేకలు వేశారు. వెంటనే ఈ విషయాన్ని అధికారులకు తెలియజేయడంతో టీటీడీ, ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తులను గుంపులుగా పంపే ఏర్పాట్లు చేశారు.