శుక్రవారం సాయంత్రం పాకాల (M) దామలచెరువు మ్యాంగోనగర్ కూడలిలో జరిగిన ప్రమాదంలో NTR జిల్లా మైలవరం మండలం కేత్రేయగూడెంకు చెందిన లారీ డ్రైవర్ నాగేశ్వరరావు బస్సు ఎక్కే క్రమంలో పట్టుతప్పి కింద పడిపోయాడు. బస్సు అతని కాలుపైకి ఎక్కడంతో తీవ్ర గాయాలైయ్యాయి. అతడిని తిరుపతి రుయాకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.