తిరుమలలో ఇద్దరు భక్తులు శ్రీవారి ఆలయం ఎదుట 'పవన్ కళ్యాణ్ అనే నేను' పుస్తకాన్ని ప్రదర్శిస్తూ వీడియో తీసి, రీల్ చేశారు. తిరుమలలో రాజకీయ ప్రచారం, ప్రదర్శనలకు నిషేధం ఉన్నప్పటికీ నిబంధనలను ఉల్లంఘించినట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.