తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్-షార్ నుంచి రేపు ఉదయం 10.17 గంటలకు ఇస్రో PSLV-C62 రాకెట్ను ప్రయోగించనుంది. ఈ ప్రయోగం ద్వారా అధునాతన భూపరిశీలన ఉపగ్రహం EOS-N1తో పాటు మరో 15 చిన్న ఉపగ్రహాలను రోదసిలోకి పంపనుంది. కొత్త ఏడాదిలో ఇస్రోకు ఇదే తొలి ప్రయోగం కానుంది. దీనికి సంబంధించిన కౌంట్డౌన్ ఈరోజు మధ్యాహ్నం 12.17 గంటలకు ప్రారంభించనున్నారు.