రేణిగుంట రైల్వేస్టేషన్ ప్లాట్ఫారమ్-1 వెయిటింగ్ హాల్లో సుమారు 50 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి అనారోగ్యంతో మరణించినట్లు జీఆర్పీ ఎస్ఐ బి. మధుసూదనరావు గురువారం తెలిపారు. మృతుడు వైట్ హాఫ్ షర్ట్, గ్రే ప్యాంట్ ధరించి, చేతికి గోల్డ్ కలర్ సోనాటా వాచ్ కలిగి ఉన్నాడని తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు రేణిగుంట రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు.