
వెంకటగిరిలో వైఎస్సార్ సీపీ కోటి సంతకాల సేకరణ
రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. వెంకటగిరి 24వ వార్డులో సోమవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రాంసుకుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన కార్యకర్తలతో కలిసి సంతకాలు సేకరిస్తూ, మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలన్న కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు.

































