వర్షాల బీభత్సం: డక్కిలిలో నిలిచిన రాకపోకలు, అధికారులు అప్రమత్తం

2285చూసినవారు
డక్కిలి మండలంలోని పాతనాలపాడు గ్రామ పంచాయితీకి వెళ్లే ఎస్సీ ఎస్టీ రోడ్డు మార్గంలో నీటి ప్రవాహం ఉదృతంగా ప్రవహించడంతో సోమవారం రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో, వెంకటగిరి సిఐ ఏవి రమణ, డక్కిలి మండల తాసిల్దార్, ఎంపీడీవో, ఎస్సై శివ శంకర్, మండల స్థాయి సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు సంఘటనా స్థలాన్ని సందర్శించి, ప్రజలను అప్రమత్తం చేశారు. డక్కిలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోలవరం రెడ్డి కోటేశ్వర్ రెడ్డి కూడా ఈ సందర్భంగా అక్కడి పరిస్థితిని సమీక్షించారు.