ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్లో ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు నడిరోడ్డుపై ఘర్షణ పడ్డారు. అక్రమంగా వసూలు చేసిన మామూళ్ల పంపకంలో తేడా రావడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఒకరు రూ.5,000 వసూలైందని చెబితే, మరొకరు రూ.2,800 మాత్రమే వచ్చాయని వాదించారు. ఈ వాగ్వాదం కాస్తా గొడవకు దారితీసింది. యూనిఫాంలో ఉండి ఇలా బహిరంగంగా అవినీతికి పాల్పడుతూ, వీధి రౌడీల్లా ప్రవర్తించడం వ్యవస్థకే తీరని అవమానమని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.