AP: తిరుపతి జిల్లా, కేవీబీపురం మండలం పెరిందేశంలో ఏడు నెలల చైత్ర అనే పసికల ఎండ వేడిమికి మృతి చెందింది. మంగళవారం విరేచనాలతో బాధపడిన చైత్రకు శ్రీకాళహస్తిలోని ఆసుపత్రిలో వైద్యం అందించారు. ఇంటికి తిరిగి వస్తుండగా చిన్నారికి తీవ్ర అస్వస్థత కలగడంతో 108 సాయంతో కేవీబీపురం PHCకి తరలించారు. అప్పటికే చిన్నారి ఎండ తీవ్రతతో మరణించినట్లు వైద్యులు తెలిపారు.