విద్యార్థులు, యువత ఆందోళనలు ఉద్రిక్తంగా మారినప్పుడు వారిపై దూకుడుగా వ్యవహరించకుండా సంయమనంతో వ్యవహరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలని భద్రతా బలగాలకు సూచించింది. జులై 20న జరిగిన సంసద్ చలో సందర్భంగా తలెత్తిన హింస నేపథ్యంలో దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఆందోళనకారుల వాదన విని, వారిని శాంతింపజేయడమే మంచిదని, వారితో జాగ్రత్తగా వ్యవహరించాలని, తద్వారా యువత హింసవైపు వెళ్లకుండా ఉంటారని కోర్టు పేర్కొంది.