AP: రాష్ట్రంలోని IIIT లలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే గడువును అధికారులు ఆదివారం వరకు పొడిగించారు. నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్లలో మొత్తం 4,400 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ (EWS) కోటా కింద అదనంగా 10% సీట్లను భర్తీ చేయనున్నారు. వచ్చే నెల రెండో వారంలో ఫలితాలు విడుదల చేసి, మూడు నాలుగు వారాల్లో కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.