ఇరాన్పై
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని
అమెరికా కోరుకుంటోందని, అది సాధ్యం కాకపోతే "ఇరాన్ పని పడతాం" అంటూ హెచ్చరించారు. ఇరాన్లోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాలని తాను కోరుకోవడం లేదని, అయితే అవసరమైతే ఇరాన్లోని వంతెనలను గంటలోనే కూల్చేయగలమని, వారి ఇంధన సరఫరా వ్యవస్థను, భారీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేసే సామర్థ్యం తమకు ఉందని ట్రంప్ అన్నారు.