నకిలీ ఆధార్ కార్డులతో టీటీడీ వసతి గదులను అక్రమంగా పొంది, వాటిని భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్న నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను తిరుమల టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 12 నకిలీ ఆధార్ కార్డులు, 2 సెల్ఫోన్లు, డిజిటల్ ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ యాప్ల ద్వారా నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి, గదులు పొంది రూ. 2 వేల నుంచి రూ. 3 వేల వరకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. అరెస్ట్ అయిన వారిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. ఈ అక్రమ దందాను ఛేదించిన సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.