అక్టోబర్లో తిరుమలలో టీటీడీ విశేష ఉత్సవాలు
By nagaraju 1175చూసినవారుఅక్టోబర్లో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాల వివరాలను టీటీడీ సోమవారం ప్రకటించింది. అక్టోబర్ 1న శ్రీవారి రథోత్సవం, 2న చక్రస్నానం, ధ్వజారోహణం, 3న శ్రీవారి బాగ్ సవారి, 7న పౌర్ణమి గరుడ సేవ నిర్వహించనుంది. అక్టోబర్ 15న తిరుమల నంబి ఉత్సవం ప్రారంభం, 20న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం, 23న భగినీహస్త భోజనం, 24న తిరుమలనంబి శాత్తుమొర, 25న నాగుల చవితి, పెద్ద శేష వాహనం, 27న మానవాళ మహామునుల శాత్తుమొర నిర్వహించనున్నట్లు వివరించింది. 28న సెనైమొదలియార్ వర్ష తిరు నక్షత్రం, 29న తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవ అంకురార్పణ, 30న తిరుమల శ్రీవారి పుష్పయాగం, 31న పూదత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, యాజ్ఞవల్క్య జయంతి జరుపనున్నట్లు పేర్కొంది.