AP: తునిలో రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 25 రోజులు గడిచినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు గాలింపును మరింత విస్తరించారు. చిన్నారి నివాసం సమీపంలోని వెయ్యి ఎకరాల అటవీ ప్రాంతాన్ని డ్రోన్లు, శునక దళాలు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో జల్లెడ పట్టినా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అడవి జంతువుల దాడి ఆనవాళ్లు కూడా లభించకపోవడంతో పోలీసులు ఇప్పుడు అపహరణ కోణంపై దృష్టి సారించారు. ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేక బృందాలు సమాచార సేకరణ చేపడుతున్నాయి. చిన్నారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆవేదనతో ఎదురుచూస్తున్నారు.