నవీ ముంబై నెరుల్లోని ఎల్పీ బ్రిడ్జ్ కింద షాకింగ్ ఘటన జరిగింది. కాలేజీకి వెళ్తున్న ఇద్దరు అమ్మాయిలు ప్రమాదవశాత్తూ విద్యుత్ ఘాతానికి గురై నీటిలో పడిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, వారిని ఆటోలో అత్యవసర చికిత్స నిమిత్తం సమీపంలోని డీవై పాటిల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.