AP: తిరుపతిలో వీబీ జీరామ్జీ పథకం ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్, సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని, అందుకే ఈ పథకం కింద ఏడున్నర లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నామని చౌహాన్ తెలిపారు. గ్రామానికి రెండు కోట్లు అందజేస్తామని, ఈ మొత్తంతో గ్రామానికి ఉపయోగపడే పనులు చేసుకోవచ్చని, వెనుకబడిన పంచాయతీలకు ఎక్కువ నిధులు వినియోగించుకునే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.