AP: అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం కేసులో మరో ఇద్దరు అరెస్టయ్యారు. గోవాకు చెందిన శిబూ, జనేష్ను అరెస్టు చేసిన ఎక్సైజ్ పోలీసులు వారిని చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేట్టిన న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం నిందితులను మదనపల్లె సబ్జైలుకు తరలించారు. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్టు చేసి ఎక్సైజ్ అధికారులు విచారిస్తున్నారు.