ఐపీఎల్ వేలంలో కొనుగోలు చేసిన తర్వాత కావాలనే వైదొలిగే ఆటగాళ్లపై రెండేళ్ల నిషేధం సరిపోదని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. బీసీసీఐ ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని, ప్రస్తుత శిక్షా విధానాన్ని పునఃపరిశీలించాలని ఆయన సూచించారు. ఇటీవల ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్ డకెట్ ఐపీఎల్ నుంచి వైదొలగడంతో ఈ చర్చ మొదలైంది. ఢిల్లీ జట్టు రూ. 2 కోట్లకు కొనుగోలు చేసినప్పటికీ, టెస్ట్ క్రికెట్పై దృష్టి సారించాలనుకుంటున్నట్లు చెప్పి అతను దూరమయ్యాడు.