AP: తిరుపతి జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని రామాలజపల్లి కూడలి వద్ద జరిగిన ప్రమాదంలో ఒక యువకుడు మరణించాడు. గూడూరు మండలం కాండ్ర-వెందోడు ప్రధాన రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో జస్వంత్ (23) అనే యువకుడు మృతి చెందగా, ఇంకో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రెండు సంఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.