ఒడిశాలోని పూరీ బీచ్లో కేంద్ర బడ్జెట్–2026కు స్వాగతం పలుకుతూ అద్భుతమైన సైకత శిల్పాన్ని రూపొందించారు. ప్రముఖ శాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్ ఈ ఇసుక శిల్పాన్ని రూపొందించి అందరి దృష్టిని ఆకర్షించారు. కేంద్ర బడ్జెట్పై ప్రజల్లో అవగాహన పెంచేలా, బడ్జెట్కు స్వాగతం చెబుతూ రూపొందించిన ఈ కళాఖండం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.