వెనెజువెలాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ట్రెన్ డి ఆరాగ్వా మాదకద్రవ్యాల ముఠాపై
అమెరికా చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో ఆ గ్యాంగ్ అగ్ర నాయకుడు హెక్టర్ రస్తెన్ఫోర్డ్ గురెరో ఫ్లోర్స్ మృతి చెందినట్లు
అమెరికా ప్రకటించింది. ఈ విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. అత్యంత గోప్య సమాచారంతో ముఠాకు చెందిన స్థావరంపై దాడులు నిర్వహించినట్లు తెలిపారు. డ్రగ్స్ అక్రమ రవాణా, హింసాత్మక నేరాలకు పాల్పడుతున్న ఈ ముఠాను
అమెరికా ఇప్పటికే ఉగ్ర సంస్థగా ప్రకటించింది. కాగా, గురెరో తలపై 5 మిలియన్ డాలర్ల రివార్డు కూడా ఉంది.