ఐపీఎల్-2026 సీజన్లో సంచలనాలు సృష్టిస్తున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, తన విధ్వంసకర బ్యాటింగ్తో ప్రపంచస్థాయి బౌలర్లను సైతం వణికిస్తున్నాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్లో 15 బంతుల్లో హాఫ్ సెంచరీ, గుజరాత్తో 31 పరుగులు చేశాడు. మంగళవారం రాజస్తాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య గౌహతిలో జరగాల్సిన మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ సెలెక్టర్ జతిన్ పరాంజ్పే కీలక వ్యాఖ్యలు చేస్తూ, వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో ముంబై ఇండియన్స్ తరపున ఆడే అవకాశం ఉందని, ట్రేడింగ్ లేదా వేలం ద్వారా ముంబై అతన్ని సొంతం చేసుకోవచ్చని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.