చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ 17 బంతుల్లో 52 పరుగులు సాధించి మెరుపు అర్ధ శతకం బాదాడు. అతని విధ్వంసకర ఇన్నింగ్స్తో రాజస్తాన్ సునాయాస విజయం సాధించింది. ఈ నేపథ్యంలో, మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ మైకేల్ వాన్ వైభవ్ను వెంటనే టీమిండియాకు ఎంపిక చేయాలని సూచించాడు. ఇది కాస్త తొందరపాటే అయినా, ఆటగాడిగా పరిణతి సాధించిన వైభవ్ టీమిండియా తరఫున సత్తా చాటగలడని వాన్ పేర్కొన్నాడు.