భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా రూపొందించిన కొత్త వందే
భారత్ స్లీపర్ రైలు బెంగళూరు రైల్వే స్టేషన్కు చేరుకుంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) సాంకేతికతతో BEML అభివృద్ధి చేసిన ఈ రైలు, నారింజ, బూడిద రంగుల కలయికతో ఆకర్షణీయంగా ఉంది. ఇది కెఎస్ఆర్ బెంగళూరు – ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ – ముంబై మధ్య నడవనుంది. దేశంలో ఇది రెండవ వందే
భారత్ స్లీపర్ రైలు. ప్రస్తుతం తుది పరీక్షల కోసం బెంగళూరులోని ఎస్ఎమ్విటి (SMVT) స్టేషన్లో ఉంచారు. BEML ఆధ్వర్యంలోనే తనిఖీలు,
పరీక్షలు జరుగుతున్నాయి. అన్ని అనుమతులు వచ్చాక అధికారికంగా ప్రారంభించనున్నారు.