ఏపీలో ఈ నెల 10 నుంచి వాహనాల బంద్

154చూసినవారు
ఏపీలో ఈ నెల 10 నుంచి వాహనాల బంద్
AP: కేంద్రం 12 ఏళ్లకు పైబడిన వాహనాల ఫిట్‌నెస్ ఛార్జీలను రూ.1,340 నుంచి రూ.33,040కు భారీగా పెంచినందుకు నిరసనగా సౌత్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (SINTA) డిసెంబర్ 10 నుంచి ఏపీలో సరుకు రవాణా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. రైల్వే గూడ్స్ యార్డులు, షిప్ యార్డులు, సివిల్ సప్లై గోదాముల్లో 12 ఏళ్లకు పైబడిన వాహనాలతో సరుకు రవాణా నిలిపివేయనున్నారు. దీంతో లారీ యజమానులపై భారీ భారం పడుతుందని సంఘం ఆవేదన వ్యక్తం చేసింది.

సంబంధిత పోస్ట్