యూపీలోని మథురలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ 13 ఏళ్ల బాలిక ప్రమాదవశాత్తు భవనం పైకప్పు నుండి కింద పడిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆమెను కాపాడలేకపోయారు. బాలిక మరణంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.