రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న మహిళలు, నీటిని ఆదా చేయడానికి ఒక వినూత్న పద్ధతిని అవలంబిస్తున్నారు. వారు పాత్రలను శుభ్రం చేయడానికి నీటిని ఉపయోగించకుండా, ఎడారి ఇసుకతో రుద్ది, ఆపై మెత్తని గుడ్డతో తుడుస్తున్నారు. ఈ పర్యావరణహితమైన, ప్రాచీన సంప్రదాయం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.