AP: నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తిరుపతి, నెల్లూరు జిల్లాలోని గూడూరు, కోవూరు ఏరియాల్లో జల్లులు పడుతున్నాయి. మరికొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై ఉంది. ఈ మధ్యాహ్నం ఉత్తర శ్రీలంక ట్రింకోమలీ-జాఫ్నా మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని IMD వెల్లడించింది. తుఫానుగా మారే అవకాశం లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ కు ముప్పు తప్పిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.