AP: గుంటూరు జిల్లా, వింజనంపాడు సచివాలయంలో యూరియా పంపిణీ విషయంలో ఉద్రిక్తత నెలకొంది. యూరియా కోసం పేర్లు నమోదు చేయడానికి వచ్చిన టీడీపీ కార్యకర్తల మధ్య మాట మాట పెరిగి, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ గొడవలో సచివాలయంలోని కంప్యూటర్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై సచివాలయ సెక్రటరీ పి. లక్ష్మీ శారద పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.