బొబ్బిలి నియోజకవర్గంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ–2026లో భాగంగా మొత్తం 2,33,621 మంది ఓటర్లలో 2,32,327 మందికి (99.45%) ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయింది. ఇప్పటివరకు 77,510 ఫారాలు (33.18%) డిజిటలైజ్ అయ్యాయి. బాడంగి, తెర్లాం, రామభద్రపురం, బొబ్బిలి మండలాలు ఈ ప్రక్రియలో ముందున్నాయి. డిజిటలైజేషన్ను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.