విజయనగరం జిల్లా బొండపల్లి మండలం ఎం. కొత్తవలస గ్రామంలో సోమవారం వర్రి రామచంద్రుడికి చెందిన ఆవు విద్యుత్ షాక్తో మృతి చెందింది. ఈ ఘటనపై ఎమ్మార్వో రాజేశ్వరరావు వివరాలు వెల్లడించారు. ప్రమాదం గురించి తెలియగానే విద్యుత్ శాఖ సిబ్బంది, పశువైద్యాధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు. వర్షాల నేపథ్యంలో విద్యుత్ స్తంభాలు, తెగిన వైర్ల సమీపంలోకి వెళ్లవద్దని ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు.