బొండపల్లి మండలంలోని దేవుపల్లి గ్రామంలో స్వయంభూగా వెలసిన రాజరాజేశ్వరీ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు జ్ఞాన సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు దూసి శ్రీధర్ శర్మ అమ్మవారిని అక్షరమాలలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని చండీ హోమం, సామూహిక అక్షరాభ్యాసాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.