నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో శనివారం సాయంత్రం పలు ప్రాంతాల్లో దుర్గాదేవి ఆకారంలో ఘనంగా దీపారాధన జరిగింది. గాంధీనగర్ కాలనీలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో లలిత త్రిపుర సుందరి అవతారంలో భాగంగా ఆరవ రోజు దీపారాధనను మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రమిదలు వెలిగించి ఆకర్షణీయంగా కనువిందు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.