చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమంతోపాటు అభివృద్ధిలో దూసుకుపోతోందని ఎమ్మెల్యే బేబీ నాయన అన్నారు. శనివారం బొబ్బిలి పట్టణం 29వార్డు, సీతయ్యపేట గ్రామంలో టిడిపి నాయకులు ఆధ్వర్యంలో సూపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకు సాగారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు.