బొబ్బిలి పట్టణంలోని వెలమవారివీధి సండే అపార్ట్మెంట్ మూడో అంతస్తులో నివసిస్తున్న ఉపాధ్యాయుడు బెవర రామకృష్ణ ఇంట్లో భారీ చోరీ జరిగింది. బీరువాలో ఉన్న సుమారు 12 తులాల బంగారు ఆభరణాలను దొంగలు అపహరించారు. రామకృష్ణ కుటుంబ సభ్యులు ఊరికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే డీఎస్పీ భవ్యారెడ్డి, ఎస్సై రమేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.