గొల్లపల్లి గ్రామంతో పాటు 12 గ్రామాల ఇలవేల్పు అయిన శ్రీ శ్రీ శ్రీ దాడితల్లి అమ్మవారిని ఎమ్మెల్యే ఆర్. వీ. ఎస్. కె. కె. రంగారావు (బేబీనాయన) మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనను సాదరంగా ఆహ్వానించారు. అర్చకులు వేదోచ్చారణ నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వదించారు. అనంతరం అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎమ్మెల్యే స్వయంగా ప్రసాదం పంపిణీ చేశారు.