
సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు
సుప్రీంకోర్టులో ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకంపై కేంద్ర న్యాయశాఖ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. వీరిలో సీనియర్ న్యాయవాది వి. మోహన, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, జస్టిస్ షీల్ నాగు, జస్టిస్ సంజీవ్ సచ్దేవ్, జస్టిస్ అరుణ్ పళ్లి ఉన్నారు. ఇటీవల సీజేఐ నేతృత్వంలోని కొలీజియం వీరి పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వీరిలో వి. మోహన ఒక్కరే సీనియర్ న్యాయవాది. ఆమె చేరికతో సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య 2కి చేరింది.




