బొబ్బిలి పట్టణానికి చెందిన కారుణ్య ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ జె. సి. రాజు 23 ఏళ్లుగా చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా విశాఖపట్నం కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ (సీడీసీ) సంస్థ నేషనల్ గ్లోరి అవార్డు 2025కు ఎంపిక చేసింది. ఈ నెల 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు విశాఖ ఋషికొండలోని శ్రీ సాయి ప్రియ బీచ్ రిసార్ట్స్లో ప్రముఖుల చేతుల మీదుగా అవార్డు ప్రదానం జరగనుంది.