బొబ్బిలి పట్టణానికి చెందిన కారుణ్య ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ జె.సి. రాజు 23 సంవత్సరాలుగా చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా విశాఖపట్నం కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ (సీడీసీ) సంస్థ నేషనల్ గ్లోరి అవార్డు 2025కు ఎంపిక చేసింది. ఈ నెల 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు విశాఖ ఋషికొండలోని శ్రీ సాయి ప్రియ బీచ్ రిసార్ట్స్లో ప్రముఖుల చేతుల మీదుగా అవార్డు ప్రదానం జరగనుంది. సీడీసీ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఎస్. అన్నపూర్ణ ఆహ్వాన పత్రాలను పంపించినట్లు తెలిపారు.