తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ విజయనగరం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ శ్యామ్ కుమార్ సూచనల మేరకు, మంగళవారం బొబ్బిలి మండలం కోమటి పల్లి రామ మందిరంలో పురాణం పంతులు బోధనపల్లి గౌరి నృసింహ ప్రసాద్ శర్మ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాముడి ధర్మ పాలన, ఆధ్యాత్మిక చింతన వంటి అంశాలపై భక్తులకు వివరించారు.