బాడంగి మండలం గొల్లాది గ్రామంలో శనివారం ఒక దారుణం చోటుచేసుకుంది. పక్షవాతంతో మంచానికే పరిమితమైన తండ్రి మామిడి సత్యంను, మద్యం సేవించి వేధించే కొడుకు రాము కత్తితో గొంతు కోసి తల వేరు చేశాడు. తండ్రిని ఆపమని సైగ చేశాడని రాము ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. తలను సిమెంట్ గోలంలో వేసి బయట పడేశాడు. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళన నెలకొంది. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.